మహబూబ్ నగర్ జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 317.850 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నిల్వ 8.319 టీఎంసీ (86.14%)లకు చేరుకుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,78,000 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 2,55,566 క్యూసెక్కులు. ప్రాజెక్టుకు సంబంధించిన 34 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1537 క్యూ సెక్కులు కాగా.. నంది పంప్ హౌజ్ కు 3150, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ 331క్యూసెక్కులు,ఎన్టీపీసీ కి 121క్యూసెక్కులు విడుదల చేశారు. కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 988 క్యూ సెక్కులు, అవుట్ ఫ్లో 833 క్యూ సెక్కులు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 697.925 అడుగులకు చేరుకుంది.