ఆదివాసిలైన ఎరుకలు కలసికట్టుగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని మదనపల్లె డివిజన ఎస్టీ ఎరు కుల ఎంప్లాయీస్ అసోసియేషన అధ్యక్షుడు పీవీరమణ, కార్యదర్శి నాగరాజు పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సంద ర్భంగా స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు సంఘటితంగా ఉంటూ ఎరుకులను అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలని కోరారు. అలాగే ఏపీ గిరిజన యానాది సం ఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎనజీవో హోమ్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదివాసిల సంస్కృతి, సాం ప్రదాయాలను కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు జానం గంగిరెడ్డి, టి.రెడ్డెప్ప, కె.విజయకుమార్,రాజేష్, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.