విభజిత గుంటూరు జిల్లాకు 95 కొత్త ఆర్టీసీ బస్సులు సమకూరనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ఆర్టీసీలో కొత్త బస్సుల ప్రతిపాదనలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 800 బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇటీవల రోడ్డు రవాణాశాఖ మంత్రి రామ్ప్రసాద్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాకు కూడా కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎమ్ రవికాంత్ తెలిపారు. కాగా కొత్త బస్సుల్లో 47 అద్దె బస్సులు కాగా మరో 48 బస్సులు ఆర్టీసీ సంస్థకి సంబందించిన సర్వీసులుగా పేర్కొన్నారు. 25 పల్లెవెలుగు సర్వీసులు, 14 సూపర్ లగ్జరీలు, 9 అలా్ట్రడీలక్స్, మరో 47 ఎక్స్ప్రెస్లు అందుబాటులోకి రానున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతోనే అద్దె బస్సుల ప్రతిపాదనలతో పాటు ఆర్టీసీ సంస్థ సొంతంగా కొత్త బస్సులు సమకూర్చునేలా ఏర్పాట్లుచేస్తోంది. ఇటీవలనే గుంటూరు నుంచి హైదరాబాద్కు రెండు బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా విభజిత గుంటూరు జిల్లాలో మొత్తం బస్సులు 500 లోపుగా ఉన్నట్లు చెబుతున్నారు.