రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నీచ రాజకీయానికి పాల్పడుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ పేరును ఎవరో ఆగంతకులు తొలగిస్తే వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం నాడు మంత్రి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వీరాంజనేయస్వామి మాట్లాడుతూ... విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు మార్చి మాజీ సీఎం జగన్ తన పేరు పెట్టుకుని అంబేద్కర్ని అవమానించారని మండిపడ్డారు.