ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాల్లో డమ్మీ బ్యాలెట్లతో చెకింగ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఇది రీ కౌంటింగ్ కాదని ఆమె స్పష్టం చేశారు. డమ్మీ బ్యాలెట్ను ఈవీఎంలలో చూపించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఒంగోలులో శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. మొత్తం 12 పోలింగ్ కేంద్రాలపై అనుమానాలు ఉన్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో ఈనెల 19నుంచి 24వతేదీ వరకు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల చెకింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంబంధిత బెల్ కంపెనీ, ఎన్నికల కమిషన్ నుంచే ప్రతినిధులు వచ్చి ఈవీఎంలలో డమ్మీ బ్యాలెట్ పేపర్లను పెట్టి చెక్ చేసి చూపిస్తారని తెలిపారు.