ఎర్రగొండపాలెం మండలంలోని గోళ్లవీడపి గ్రామంలో గురువారం మధ్యాహ్నం సండ్రపాటి సరళ (23) ఇంటిలో అనుమానస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో సరళ తల్లిదండ్రులు బంధువులు శుక్రవారం ఎర్రగొండపాలెం వైద్యశాల వద్ద జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. సరళను భర్త దేవదాసు, అత్త, మావ, అడబిడ్డలు కొట్టిచంపారని ఆందోళన చేశారు. సరళది హత్య అని తల్లిదండ్రులు నీరూరి గజ్జెలయ్య, మరియమ్మ, ఆమె బంధువులు ఆరోపించారు. ధర్నా చేస్తున్న సరళ తల్లిదండ్రులు, బంధువుల వద్దకు డీఎస్పీ బాలసుందరరావు, సీఐ రాములు నాయక్ వచ్చి సరళ మృతిపై పూర్తి న్యాయం చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. పోస్టుమార్టంలో పూర్తి వివ రాలు వెలుగులోని వస్తాయన్నారు. పోస్టు మార్టంలో వైద్యుల నివేదిక ప్రకారం కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తా మన్నారు. దొనకొండ మండలం మంగినపూడి గ్రామం నుంచి 100 మందికిపైగా సరళ బంధువులు వచ్చి ధర్నా చేశారు. అయితే సరళ భర్త దేవదాస్, అత్తమామలు గోళ్లవీడపి గ్రామంలో నివాసం గృహం వదిలి వెళ్లారు.