పొదిలి ప్రాంతవాసులు ఎదురు చూస్తున్న నడికుడి కాళహస్తి రైల్వే నిర్మాణ పనులు పొదిలి ప్రాంతంలో శరవేగంగా జరుగుతున్నాయి. దర్శి, పొదిలి, కనిగిరి మీదుగా జరిగే ప్రాజెక్ట్ పనులకు సంబంధించి వంతెన, రైల్వేస్టేషన్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికా వచ్చాయి. దర్శి నుంచి కనిగిరి వరకు మూడోదశ పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. మండలంలోని దాసర్ల పల్లి, బుచ్చనపాలెం, కాటూరివారిపాలెం, రాజుపాలెం మీదుగా సాగుతున్న పనులు ప్రస్తుతం కట్టపై కంకర, పట్టాల నిర్మాణం పూర్తి అయిం ది. మరోవైపు రాజుపాలెం గ్రామం సమీపంలో స్టేషన్ నిర్మాణం కొనసాగుతోంది. ప్రధాన రహదారి కాటూరివారి పాలెం పొదిలి మధ్యలో ఇప్ప టికే అండర్పాస్ వంతెన నిర్మా ణం పనులు పూర్తయ్యాయి. అయితే రాజు పాలెం సమీపంలో కొంతభాగం పరిహారం తక్కువగా ఇస్తున్నారని ప్రైవేటు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలిసింది. రైల్వే అధికారులు ఆ ప్రదేశాన్ని వదిలేసి అటు ఇటూ మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. స్టేషన్కు సంబంధించి అన్ని రకాల ఫ్లాట్ఫాంలు, భవనాల నిర్మా ణం కొనసాగుతోంది. మరో రెండేళ్లలో ఈ ప్రాంత వాసుల కల నెరవేరనుందని, మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దర్శి వరకు అధికారులు రైలులో ప్రయాణం చేసిన విషయం తెలిసిందే.