ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం తీసేస్తుందని కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. శుక్రవారం నాడు నెల్లూరులో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వంలో ఏపీని పూర్తిగా అవినీతి మయం చేశారని.. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం నుంచి రూ.400 కోట్లను దారి మళ్లించారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు.