శ్రీశైలం దేవస్థానానికి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ శ్రీశైలం శాఖ అధికారులు శుక్రవారం ట్రాక్టర్ను విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని బ్యాంక్ చైర్మన్ ఎస్. సత్యప్రకాశ్ సింగ్ ట్రాక్టర్ను ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజుకు అందజేశారు. ట్రాక్టర్ విలువ రూ.12 లక్షల రూపాయలు అని బ్యాంఖ అధికారులు తెలిపారు. ప్రధాన ఆలయం ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద ట్రాక్టర్కు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులకు దేవస్థానం ఈవో పెద్దిరాజు స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. ఈ విరాళం కార్యక్రమంలో దేవస్థానం ఈఈ రామకృష్ణ, బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.