కర్నూలు వనటౌన పోలీస్స్టేషన పరిధిలోని గడియారం ఆసుపత్రి సమీపంలో వర్మ కాంపౌండులో జరిగిన శివ హత్య కేసులో పోలీ సులు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు షేక్ రఫీక్, తెలుగు బ్రహ్మం, భరత, పింజరి ముర్తుజావలిలను అరెస్టు చేసి డీఎస్పీ ఎదుట హాజరు పరిచారు. డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐ పవన కుమార్లు శుక్ర వారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిం చారు. తాండ్రపాడుకు చెందిన వర్మ కాంపౌండులో వాచమెనగా పని చేస్తున్నారు. రఫీక్ భార్యతో వివాహేతర సంబంధం నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రఫిక్ తన స్నేహితులతో కలిసి శివను హత్య చేశాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ వెల్లడించారు.