ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ ఆస్తులని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 24, 2024, 09:39 PM

నైతిక విలువలు లేకుండా సొంత తల్లి, చెల్లిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కోర్టుకు ఎక్కడం సిగ్గుచేటని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. తల్లి , చెల్లిని ఇబ్బందులు పెట్టడం చూస్తే జగన్ రెడ్డి చరిత్ర హీనుడుగా నిలుస్తారన్నారు. జగన్ రెడ్డి బరితెగింపు చూస్తే ఆయన వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని అనుమానం కలుగుతోందన్నారు. ప్రధాని కూడా జగన్ రెడ్డి అక్రమ సంపాదనపై విచారణ చేయించాలన్నారు. జగన్ రెడ్డి ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకొని జాతీయీకరణ చేయాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com