మానవ జీవనంలో ఫోన్ ఒక భాగమైన తరుణంలో ప్రజలు పలు కారణాల వల్ల ఫో గొట్టుకున్న తమ సెల్ ఫోన్లను సీఈ ఐఆర్ ఫోర్టల్లో వెంటనే ఫిర్యాదు చేస్తే రికవరీ చేసి బాధితులకు అందజేస్తామని శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహే శ్వరరెడ్డి అన్నారు. జిల్లాలో జూన్ 21 నుంచి పోయిన 15 లక్షల విలువైన సుమా రు 100 ఫోన్లను రికవరీ చేసి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం బాధితుల కు ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేటికి జిల్లాలో 2021 డిసెంబరు నుంచి నేటికి 79 లక్షల విలువైన 618 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితు లు హెచ్టీటీపీఎస్ః//డబ్ల్యూడబ్ల్యూ.సీఈఐఆర్.జీవోవీ.ఇన్లో తక్షణమే ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ జి.ప్రేమ్ కాజల్, సైబర్ సెల్ సీఐ టి.శ్రీను, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.