ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా కులాలను ఓబీసీలో చేర్చాలి, కేంద్ర మంత్రికి వినతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 08:21 PM

కళింగ కోమటి, సొండి, శిష్టకరణ కులాలను ఓబీసీలో చేర్చే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆయా సంఘాల నేతలు కోరారు. ఈ మేరకు వారంతా శుక్రవారం ఢిల్లీలోని సింధూర బ్లాక్‌లో కేంద్ర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయడును కలిసి వినతిపత్రాలు అందించారు. మా కులాలను ఓబీసీలో చేర్చి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కళింగ కోమ ట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయిన గోవింద రాజులు, రాష్ట్ర కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు, ట్రెజరర్‌ పట్నాన సాయికిరణ్‌, టీడీపీ సీనియర్‌ నాయకులు పీవీ రమణ, తంగుడు కృష్ణ, బోయిన సత్యానందం, శాసనపురి మధుబాబు, సొండి కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శు లు రత్నాల కాశీవిశ్వనాథ్‌, సాహుకారి నాగేశ్వరరావు, శిష్టకరణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పోలు మహంతి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కళింగ కోమటి, సొండి, శిష్టకరణ కులాలను ఓబీసీలో చేర్చేందుకు తనవంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com