కాశీబుగ్గ పాత జాతీయరహదారి ఎల్సీ గేటు వద్ద శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు కిందపడి బ్రాహ్మణ వీధికి చెందిన మురళీ పాత్రో(62) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం డిపోకు చెందిన బస్సు పలాస ఆర్టీసీ కాంప్లెక్స్కు వస్తున్న సమయంలో రైల్వే గేటు వేయడంతో డ్రైవర్ గోపి బస్సును నిలు పుదల చేశారు. గేటు ఎత్తిన తరువాత బస్సు కదిలే సమయం లో మురళీపాత్రో వెనుక చక్రాల కిందపడి ఆత్మహత్య చేసుకు న్నాడు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పాత్రో కొన్నాళ్లపాటు బస్టాండ్ ఆవరణలో స్వీట్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తు న్నాడు. వ్యాపారం కలిసి రాకపోవడంతో స్వీట్లు తయారుచేసి దుకాణాలకు విక్రయిం చే వ్యాపారం ప్రారంభించాడు. ఈ సమయంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలి యరాలేదు. ఘటనా స్థలాన్ని కాశీబుగ్గ ఎస్ఐ పారినాయుడు, సిబ్బంది చేరుకుని పరిశీలించారు. ఘటన తీరును ఆర్టీసీ డ్రైవర్ను అడిగి తెలుసుకున్నారు. కేసు నమో దు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.