సాలూరు పరిధిలోని ఏవోబీలో కొఠియాగ్రూపు గ్రామం మూలతాడివలస సమీ పంలో ప్రవహిస్తున్న గంజాయిభద్రగెడ్డ (చిట్టిగెడ్డ)లో శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం కనిపించింది.ఈ విషయమై సమాచారం అందుకున్న సాలూరు రూర ల్ ఎస్ఐ ఎం.వెంకటరమణ హుటాహుటిన అక్కడకు వెళ్లారు. మృతుడు 35 ఏళ్ల వయస్సు వ్యక్తిగా గుర్తించామని చెప్పారు. మరణించి సుమారు 15 రోజులు కావ డంతో మృతదేహం ఛిద్రమై ఉందన్నారు. ముఖం గుర్తుపట్టలేని విధంగా తయార య్యిందన్నారు. కేవలం పుర్రెమాత్రం ఉందని చెప్పారు. మృతదేహానికి అక్కడికక్కడే శవపరీక్షలు నిర్వహించారు.సాలూరుసర్కిల్ పరిధిలో ఇటీవల మిస్సింగ్ కేసులు నమోదు కాలేదని, మృతుడి ఆచూకీకోసం ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.