విజయనగరంలోని సర్విజ్జీ మైదానం, పీవీజీ రాజు నార్త్జోన్ క్రికెట్ అకాడమీ మైదానంలో సీనియర్ పురుషుల అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు హోరా హోరీగా సాగుతున్నాయి. సర్విజ్జీ మైదానంలో తూర్పుగోదావరి- విజయనగరం జిల్లా జట్ల మధ్య శుక్రవారం ప్రారంభమైన మ్యాచ్లో తొలి ఇన్నిం గ్స్లో తూర్పుగోదావరి జట్లు 70.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో ఏవీవీ విజయ్, పి.పాండురంగా అర్ధసెంచరీలు సాధించారు. విజయనగరం జట్టులో బౌలర్లు సమిష్టిగా రాణించి తూర్పుగోదావరిజట్టు బ్యాట్స్మెన్లను కట్టడి చేశారు. పి.తేజస్వీ 18 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్టు పడగొట్టారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన విజయనగరం జట్టు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి 58 పరుగులు చేసింది. కెప్టెన్ పి.తపశ్వీ 30 పరుగులు, ఎస్.హరీష్ 18 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. కాగా పీవీజీరాజు నార్త్జోన్ క్రికేట్ అకాడమీ మైదానంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో విశాఖ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు బ్యాట్స్మెన్లు సమిష్టిగా రాణించి 69.2 ఓవర్లలో 330 పరుగులు సాధిం చారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీకాకుళం జట్లు 14 ఓవర్లలో వికెట్ నష్టపోయి 34 పరుగులు చేసింది.