కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శించుకుని భక్తులు పరవశించిపోతుంటారు. ఒక్కసారైనా ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. అలాగే తిరుమలలో నిత్యం ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం తిరుమలలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందు కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈనెల 15 నుంచి 17 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాల కోసం ఈనెల 14న అంకురార్పణ జరుగనుంది.