ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి లక్ష్మణరావు అన్నారు. శనివారం నల్లజర్ల మండలం సింగరాజుపాలెం, ప్రకాశరావు పాలెం గ్రామాల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దోమలు వృద్ధిచెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రాత్రి వేళల్లో దోమతెరలు వినియోగించాలన్నారు. హెల్త్ సూపర్వైజర్ సత్యనారాయణ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.