ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీలో చేరిన ప్రముఖ పారి శ్రామికవేత్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 11:16 PM

ప్రముఖ వస్త్రవ్యాపారి, జాంపేట కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ బొమ్మన జయకుమార్‌, ప్రముఖ పారి శ్రామికవేత్త కనకం నాగేశ్వరరావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో గురువారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ సమక్షంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఒకప్పుడు బొమ్మన కుటుంబం టీడీపీతోనే ఉండేది. అయితే దివంగత బొమ్మన రాజకుమార్‌ వైసీపీలో చేరి ఎమ్మె ల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఈ కుటుం బం వైసీపీతోనే ఉంది.ప్రస్తుతం జాంపేట కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా బొమ్మన జయకుమార్‌ వ్యవహరిస్తున్నారు.ఈ నెల 25న బ్యాంక్‌ ఎన్నికలు జరగనున్నాయి.తిరిగి ఆయన చైర్మన్‌ అభ్యర్థిగా ఏకగ్రీ వంగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరు గుతోంది. ఆయన తండ్రి రాజకుమార్‌ మూడు దఫాలు జాంపేట బ్యాంక్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన అకాల మృతితో జయకుమార్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి ఆయనే చైర్మన్‌గా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com