మదనపల్లె సర్వజన బోధనాస్పత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశా రు. గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించలేదని కార్మికులు ధర్నా నిర్వహించారు. గురువారం స్థానిక ఆస్పత్రి ఆవరణలో జరిగిన ధర్నాలో కార్మికులు మాట్లాడుతూ ఐదు నెలలుగా వేతనాలు రాలేదని కాంట్రాక్టరు ప్రతినిధి శరతయాదవ్కు ఫోన చేసినా ఆయన స్పందించలేదన్నారు. ఐదు నెలలుగా అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవా ల్సిన దుస్థితిలో ఉన్నామన్నారు. కాగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహానబాషా ప్రతినిధి షంషీర్ ఆస్పత్రి వద్దకు చేరుకుని కార్మికులతో చర్చించారు. నాలుగు రోజుల్లోపు కార్మికులకు వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కార్మి కులు ఇనచార్జి సూపరింటెండెంట్ శివరామ్ప్రసాద్, ఆర్ఎంవో ప్రసాదరాజుకు వినతి పత్రం అందజేశారు. కార్మికులకు ఐటీయూసీ అధ్యక్షుడు జి.కృష్ణమూర్తి మద్దతు తెలిపారు.