ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రంలోను మెప్పు పొందుతున్న రామ్మోహన్ నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 10:12 PM

కింజరాపు రామ్మోహన్ నాయుడు.. తండ్రి ఎర్రన్నాయుడు మరణానంతరం 26 సంవత్సరాలకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యువనేత. టీడీపీలో అంచలంచెలుగా ఎదిగారు. వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికై హ్యాట్రిక్ కొట్టారు. ఎంపీగా ఉంటూ ఏపీలో అనేక సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తారు. ఇప్పుడు కేంద్రమంత్రిగా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. తాజాగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా  అభినందనలు పొందారు రామ్మోహన్.  పౌర విమానయాన శాఖకు సంబంధించిన ప్రశ్నలకు.. సభ్యులకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సవివరంగా సమాధానాలు ఇచ్చారు. దీంతో రామ్మోహన్‌ నాయుడిని స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానం ఇస్తున్నారని స్పీకర్ కితాబిచ్చారు. పౌర విమానయాన శాఖపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు రామ్మోహన్‌ నాయుడు సమాధానం ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com