ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ప్రారంభం కానున్న మస్తానవలి స్వామి ఉరుసు ఉత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 03:43 PM

గుంతకల్లు పట్టణంలోని పాతగుంతకల్లులలో వెలసిన హజరత సయ్యద్‌ మస్తానవలి స్వామి 389వ ఉరుసు ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల నిర్వహణకు వక్ఫ్‌ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం గంధం, గురువారం షంషీర్‌, శుక్రవారం జియారత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉరుసు ఉత్సవాలకు రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. భక్తులకు తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తాగునీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు. దర్గాను విద్యుత దీపాలతో అలకంరించారు. దర్గా అవరణంలో 24 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గంధం, షంషీర్‌ రోజు వక్ఫ్‌ బోర్డు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com