ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమకి ప్రభుత్వం అండగా నిలవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 03:41 PM

రాష్రంలోని మిగతా ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తుంటే సీమ జిల్లాలో చినుకు జాడ లేకపోవడం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సీమ జిల్లాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. సీపీఐ ఆఫీ్‌సలో సోమవారం పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి జాఫర్‌, శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ ఏపీలో అనేక మంది స్వాత్యంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకులు ఉన్నారన్నారు. టంగుటూరి ప్రకాశంపంతులు, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర్‌రావు వంటి మహనీ యుల పేర్లను భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు పెడతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com