జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాలలో ప్రతి బుధ, శుక్రవారంలో చేపడుతున్న డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలను కొనసాగించాలని డి. ఎల్. డి. ఓ పడాల వాసుదేవరావు ఆదేశించారు. శుక్రవారం నరసన్నపేట మండలం సత్యవరం గ్రామంలో స్థానిక పాఠశాల వద్ద పారిశుధ్య పనులను పరిశీలించారు. ముఖ్యంగా పాఠశాలలు అంగన్వాడి కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద పారిశుధ్యం మెరుగుగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.