ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జలదిగ్బందంలో లంక గ్రామాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 01:44 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి.గన్నవరం, మామిడికుదురు,అయినవిల్లి మండలాల్లో లంక గ్రామాలు జలదిగ్బందంలో ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 55 వేల ఎకరాలకు పైగా వరి, 30 వేల ఎకరాలకు పైగా నారుమళ్ళు, 1400 ఎకరాలకు పైగా ఉద్యాన, కూరగాయలు పంటలు నీటమునిగాయి. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. 46.07 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం 10,83,684 క్యూసెక్కులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com