ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ ఛాంపియన్స్ అఫ్ లెజెండ్స్ లీగ్ లో ఫైనల్ కి చేరుకున్న భారత్ మరియు పాకిస్థాన్ జట్లు....

sports |  Suryaa Desk  | Published : Sat, Jul 13, 2024, 05:06 PM

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2024) టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో, ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 20 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఛాంపియన్‌ను ఓడించి ఛాంపియన్స్ ఫైనల్‌లోకి ప్రవేశించగా, భారత్ 86 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఛాంపియన్‌ను ఓడించి ఛాంపియన్స్ ఫైనల్‌లోకి ప్రవేశించింది.  దీని ప్రకారం శనివారం (జులై 13 బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నాయి. ఇండియా ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్‌సైట్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.


 2వ సెమీ-ఫైనల్‌లో  భారత్ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించంది. నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ జట్టు కెప్టెన్ బ్రెట్ లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత ఛాంపియన్స్ జట్టుకు ఓపెనర్ రాబిన్ ఉతప్ప శుభారంభాన్ని అందించాడు. అయితే మరోవైపు 14 పరుగులకే అంబటి రాయుడు ఔటయ్యాడు. అయితే ఉతప్ప 35 బంతులు ఎదుర్కొని 4 సిక్సర్లు, 6 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చిన సురేశ్ రైనా 5 పరుగులు మాత్రమే చేసి వికెట్‌ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత యువరాజ్ సింగ్ 28 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 59 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ కలిసి మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన చేశారు. ఫలితంగా చివరి 6 ఓవర్లలో 95 పరుగులు వచ్చాయి. దీంతో భారత ఛాంపియన్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. దేంతో సెమీస్ లో భారత్ ఘానా విజయం పొంది పాకిస్థాన్ పై ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com