ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో పోర్ట్, ఎయిర్ పోర్ట్ అర్ధాంతరంగా ఆగిపోయాయని చెప్పారు. నెల్లూరు జిల్లాలో సెజ్లు, పరిశ్రమలపై దృష్టి సారించే విషయంపై ఈ సమావేశంలో చర్చించుకున్నామని అన్నారు. జిల్లాలో శాశ్వత పట్టాల పేరుతో ల్యాండ్ స్కాం జరిగిందన్నారు. జిల్లాలో రైతులకు న్యాయం చేసేందుకు, పరిశ్రమలు, పెట్టుబడులు రాబట్టేందుకు కలసికట్టుగా కృషి చేస్తామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.