తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్య కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటి శుభ పరిణామమన్నారు. విభజన చట్టంలోని అంశాలు నీటి సమస్యలపై స్నేహపూర్వకంగా చర్చలు జరగాలన్నారు. రాజకీయాలకు తావు లేకుండా సమస్యల పరిష్కారానికి సీఎంలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రెండు ప్రాంతాల మధ్య వైశమ్యాలు పెంచుతూ కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కేసీఆర్ విద్వేషపూరితమైన వాతావరణాన్ని నెలకొల్పారని మండిపడ్డారు. ఇప్పటి వరకు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారన్నారు.