నంద్యాల జిల్లా మహానందిలో మళ్లీ చిరుతపులి సంచారం స్థానికుల్ని వణికిస్తోంది. అడవిలోని కృష్ణనంది క్షేత్రానికి వెళ్లే పాత రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కనిపించింది. అలాగే మహానంది క్షేత్రంలోని గోశాల దగ్గర చిరుత కొంతసేపు ఆగి రథమార్గం గుండా అడవిలోకి వెళ్లిపోయింది. మహానందిలో చిరుత సంచారం గురించి తెలియగానే స్థానికులు భయాందోళనలో ఉన్నారు. చిరుత మహానందిలోని పార్వతీపురం, అరటితోటల్లో సంచరించడంతో కోతులు, కుక్కలు పెద్దగా అరుస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించి స్థానికులు చిరుత సంచారాన్ని గుర్తించి అటవీశాక అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు పొలాలకు వైపు వెళ్లాలంటే భయపడుతున్నారు. పంటలు సాగు చేశామని.. ఇప్పుడు వాటి దగ్గరకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు వెంనటే స్పందించి.. మహానంది ప్రాంతంలో తిరుగుతున్న చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.