ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదవశాత్తు మృతి చెందిన పెయింటర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 27, 2024, 04:57 PM

పెయింటింగ్‌ వేస్తూ కిందపడి వ్యక్తి చనిపోయిన ఘటన విజయనగరం జిల్లా, బాడంగి మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ ఆర్‌. జయంతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెరకముడిదాం మండలం చినమత్రిపేట గ్రామానికి చెందిన రాగోలు మహేష్‌(38) పెయింటర్‌గా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని గజరాయనివలస గ్రామంలోని ఓ ఇంటికి పెయింటింగ్‌ వేసేందుకు బుధవారం వచ్చాడు. ఇలా పెయింట్‌ వేస్తుండగా బుధవారం సాయంత్రం కాలుజారి పైనుంచి కిందకు పడిపోయాడు. ఈ ఘటనలో మహేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మహేష్‌ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com