ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌కు దక్కిన ప్రైజ్‌మనీ ఎంతంటే?

sports |  Suryaa Desk  | Published : Sun, Jun 30, 2024, 01:05 PM
 పదకొండేళ్ల తర్వాత భారత్‌ ఖాతాలోకి ఐసీసీ ట్రోఫీ చేరింది. చివరిగా 2013లో ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలుచుకుంది. అతడి సారథ్యంలోనే 2007 పొట్టి కప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు రోహిత్‌ కెప్టెన్‌గా 2024 టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024)లో విశ్వవిజేతగా భారత్‌ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో టీమ్‌ఇండియా గెలిచింది. విజేత భారత్‌కు, రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు భారీ మొత్తంలోనే ప్రైజ్‌మనీ దక్కింది. సెమీస్‌లో నిష్క్రమించిన జట్లకూ ఐసీసీ ప్రైజ్‌మనీని అందించింది.

ప్రైజ్‌మనీ వివరాలు (దాదాపు) ఇలా..

విజేత: భారత్‌కు రూ. 20.50 కోట్లు

రన్నరప్‌: దక్షిణాఫ్రికాకు రూ. 10.60 కోట్లు

సెమీఫైనలిస్టులు: ఇంగ్లాండ్‌, అఫ్గానిస్థాన్‌కు చెరో రూ. 6.50 కోట్లు

సూపర్‌-8కు చేరిన 12 జట్లు: ఒక్కో టీమ్‌కు రూ. 2 కోట్లు

13 నుంచి 20వ స్థానంలోని ఒక్కో టీమ్‌కు రూ.1.90 కోట్లు

ప్రతి జట్టు విజయం సాధించిన మ్యాచ్‌కు అదనంగా రూ. 26 లక్షలు

టీ20 ప్రపంచ కప్‌ ప్రైజ్‌మనీ మొత్తం విలువ రూ. 93.80 కోట్లు





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com