ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరుత కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 27, 2024, 04:50 PM

ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, దేవనగరం సమీపంలో చిరుతపులి రెస్క్యూ ఆపరేషన్ రెండోరోజు కొనసాగుతోంది. పాత పేపర్ మిల్లు సమీపంలో ఉన్న గుంతలో నిన్న చిరుతపులి పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు, వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిన్న రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చిరుతను బయటకు తీసుకు వచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించారు. అయితే చీకటిపడడంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. గురువారం ఉదయం మళ్లీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చిరుతపులిని రక్షించి దానిని అడవిలో విడిచిపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com