ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకనుండి వలంటీర్లకు న్యూస్‌ పేపర్ కట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 07:01 PM

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లకు న్యూస్‌ పేపరు అలవెన్స్‌ను ప్రభుత్వం కట్‌ చేసింది. ఈమేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ ఎం.శివప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల జూన్‌ వేతన బిల్లులు కూడా నిలిపివేయాలని ప్రభుత్వం ఖజానా శాఖ డైరెక్టర్‌కు లేఖ రాసింది. డీడీవోలు వీరి జీతం, గౌరవవేతనంతోపాటు న్యూస్‌ పేపర్‌ అలవెన్స్‌ రూ.200 కలిపి బిల్లులు ఖజానా శాఖకు సమర్పించారు. అయితే ప్రభుత్వం వీరికి తక్షణమే న్యూస్‌ పేపర్‌ అలవెన్స్‌ కట్‌ చేయాలని సూచించినందున ఖజానాకు సమర్పించిన బిల్లులను రద్దుచేయాలని ఆశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. న్యూస్‌ పేపర్‌ అలవెన్స్‌ను మినహా యించి కేవలం జీతం, గౌరవ వేతనం బిల్లులు మాత్రమే డీడీవోలు తిరిగి ఖజానాకు సమర్పించాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com