ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సొంగా రోషన్కుమార్ హెచ్చ రించారు. లింగపాలెం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అధికారులు పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేయాలన్నారు. ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్క రించాలన్నారు. మండలంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, సాగునీరు సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులు నివేదిక ఇవ్వాలన్నారు. ఎంపీడీవో రాంబాబు, తహసీల్దార్ ప్రసాద్, గరిమెళ్ళ చలపతిరావు, జగ్గవరపు ముత్తారెడ్డి, గుత్తా సత్య సాయివరప్రసాద్, మోరంపూడి మల్లికార్జునరావు, గారపాటి బుజ్జియ్య, ముసునూరి రాము, నందిగం సీతారామ్తిలక్, సుధీర్బాబు, బొంతు రాంబాబు, బొంతు శ్రీను, అసిలేటి అజయ్, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.