ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. ఆ 3 రైళ్లు ఆగస్టు 11 వరకు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 23, 2024, 04:17 PM

రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ అలర్ట్ చేసింది. ఈ నెల 23 వ తేదీ నుంచి ఆగస్టు 11 వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్‌ అధికారి తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన రైళ్లలో కీలకమైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. దీంతో ఈ రోజుల్లో ఆ రైళ్లలో ప్రయాణించాల్సిన ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ నిడదవోలు-కడియం మధ్య జరుగుతున్న ఆధునికీకరణ పనుల కారణంగానే ఈ రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అధికారులు తెలిపారు.


సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు రాజమండ్రి, విశాఖల మధ్య రాకపోకలు సాగిస్తూ ఉంటుంది. సింహాద్రి ఎక్స్‌ప్రెస్ గుంటూరు, విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తూ ఉంటుంది. విశాఖ, విజయవాడ మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రద్దు కానున్నాయి. ఈనెల 24 వ తేదీ (సోమవారం) నుంచి ఆగస్టు 10 వ తేదీ వరకు రాజమండ్రి-విశాఖ (07466) మధ్య నడిచే ప్యాసింజర్ రైలు.. విశాఖ-రాజమండ్రి (07467) మధ్య నడిచే ప్యాసింజర్ రైలు రద్దు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. గుంటూరు-విశాఖ (17239) మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖ-గుంటూరు (17240) మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు కానుంది.


విజయవాడ-విశాఖ (12718) మధ్య నడిచే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్, విశాఖ-విజయవాడ (12717) మధ్య నడిచే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్ కూడా రద్దయిన రైళ్ల జాబితాలో ఉంది. గుంటూరు-విశాఖ (22702) మధ్య నడిచే ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్, విశాఖ-గుంటూరు (22701) మధ్య నడిచే ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా కొన్ని రోజుల పాటు సేవలు అందించదని పేర్కొన్నారు, విశాఖ-తిరుపతి (22707) మధ్య నడిచే డబుల్‌డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ను కూడా రైల్వే అధికారులు రద్దు చేశారు.


ఈనెల 23 నుంచి ఆగస్టు 10 వరకు మచిలీపట్నం-విశాఖ (17219), విశాఖ-మచిలీపట్నం (17220) ఎక్స్‌ప్రెస్, గుంటూరు-రాయగడ (17243), విశాఖ-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రద్దయ్యాయి. ఈనెల 24 నుంచి ఆగస్టు 11 వరకు రాయగడ-గుంటూరు (17244), లింగంపల్లి-విశాఖ (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. ఈనెల 24 నుంచి ఆగస్టు 9 వరకు తిరుపతి-విశాఖ (22708) డబుల్‌డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com