ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన ప్రాంతం సస్యశామలం కానుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 20, 2024, 03:03 PM

మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి కావడం జిల్లా రైతుల అదృష్టంగా భావిస్తున్నట్టు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయి 2024 ఖరీఫ్‌ వరివిత్తనాల పంపిణీ కార్యక్రమంలో అయన పాల్గొని అభ్యుదయ రైతులను సత్కరించారు. విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవససాయశాఖ జేడీ శ్రీధర్‌, ఏడీఏ శ్రీనివాసరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌, మండల బీజేపీ అధ్యక్షుడు ఇజ్జాడ శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త విశ్వక్షేన్‌, ఎంపీపీ లుట్ట అమ్మాజమ్మ, జడ్పీటీసీ మీసాల సీతంన్నాయుడు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ తోటయ్యదొర, మాజీ జడ్పీటీసీలు పిన్నింటి మధుబాబు, ఆర్‌.ప్రకాశరావు, టీడీపీ నాయకులు కె.రవికుమార్‌, గంట్యాడ మహేష్‌, లంక రాంబాబు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com