ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ సైకో విధానాలను భరించలేక కూటమిని గెలిపించారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2024, 03:48 PM

అవినీతి, అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టారని నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి అన్నారు. గురువారం అమావాస్య సందర్భంగా మండలంలోని భైరాపురం గ్రామ సమీపాన వెలసిన ఆంజనేయస్వామికి గౌరు వెంకటరెడ్డి, టీడీపీ యువ నాయకుడు  గౌరు జనార్దన్‌ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. గౌరు కుటుంబానికి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారన్నారు. జగన్‌, వైసీపీ నేతల అహాంకారం, సైకో విధానాలను భరించలేక అన్ని వర్గాల ప్రజలు వైసీపీని గెలిపించారన్నారు. గౌరు చరితను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పుసులూరు ప్రభాకర్‌ రెడ్డి, నాయకులు, కార్యక ర్తలు పాల్గొన్నారు. అలాగే మండలంలోని కొమ్ముచెరువు, కాల్వ, భైరాపురం గ్రామాల్లో అమావాస్య పర్వదినం కావడంతో భక్తులు స్వామివారికి పూజలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com