ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్డీఏ సమావేశానికి హాజరుకానున్న పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2024, 03:26 PM

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తినకు బయలుదేరారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి చంద్రబాబు వెళ్లనున్నారు. సాయంత్రం జరిగే ఎన్డీఏ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఎన్డీఏలో ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా ఢిల్లీ పెద్దలను ఆయన ఆహ్వానించనున్నారు. మరోవైపు మంగళగిరి కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కి పవన్ దంపతులు సైతం బయలుదేరారు. మరి కాసేపటిలో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. నేడు చంద్రబాబుతో పాటు పవన్ కూడా బీజేపీ పెద్దలను కలవనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఎన్డీఏ సమావేశంలో తన అభిప్రాయాలను పవన్ కల్యాణ్ చెప్పనున్నారు. 1984, 1994ను మించిన స్థాయిలో ఇప్పుడు ప్రజల నుంచి రియాక్షన్ వచ్చిందని పవన్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com