ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ మీదుగా భారత్ గౌరవ్ రైలు,,,అయోధ్యతో పాటుగా నేపాల్‌కు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 07:33 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రం మీదుగా భారత్ గౌరవ్ రైలు నడపనున్నట్లు తెలిపారు అధికారులు. ఈ రైలు నేపాల్, ముక్తినాథ్, దివ్య దేశం యాత్ర ప్రత్యేక ప్యాకేజీతో నడుస్తుంది. ఈ భారత్ గౌవర్ రైలు జూన్‌ 7న చెన్నైలో బయలుదేరి.. జూన్ 19న తిరుగు ప్రయాణం అవుతుందని అధికారులు తెలిపారు. ఈ రైలు విజయవాడ డివిజన్‌ పరిధిలోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్, ఖాజీపేట స్టేషన్‌ల మీదుగా వెళుతుంది. అలాగే ముక్తినాథ్, నైమిశారణ్యం, ఖాడ్మండు, పశుపతినాథ్, అయోధ్య ప్రాంతాలకు వెళుతుంది.


ఈ భారత్ గౌరవ్ రైలులో వెళ్లాలనుకునే భక్తులకు ఛార్జీల వివరాలను కూడా వెల్లడించారు. సెకెండ్‌ ఏసీ క్లాస్‌లో టీ, టిఫిన్, భోజనం, హోటల్‌ గదులు, రవాణాతో కలిపి టికెట్‌ ఒక్కొక్కరికీ రూ.59,950గా నిర్ణయించారు. అదే థర్డ్‌ ఏసీలో అయితే రూ.54,900.. స్లీపర్‌ క్లాస్‌లో రూ.45,900గా ఉంది. ఈ భారత్ గౌరవ్ రైల్లో టికెట్ల బుకింగ్‌ ఇతర వివరాలకు 93550 21516 నంబరులో సంప్రదించాలని కోరారు రైల్వే అధికారులు. ఆసక్తి ఉన్నవారు వెంటనే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com