ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే హింసాత్మక ఘటనలు జరిగాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 11:04 AM

ఎన్నికలకు ముందు ఉన్న కలెక్టర్లు, ఎస్పీలను ఎన్నికల కమిషన్‌ మార్చేసింది అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అయన మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, చంద్రబాబు కలిసి అధికారులపై కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు. వారి ఫిర్యాదుల ఆధారంగా అధికారులను మార్చారు. ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే హింసాత్మక ఘటనలు జరిగాయి. పల్నాడు, అనంతపురం, తిరుపతిలో ఎస్పీలను మార్చారు.. ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయి.. అక్కడే అధికారుల సస్పెన్షన్లు జరిగాయి. అక్కడే మళ్లీ కొత్త అధికారులను నియమించారు. అక్కడే స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ వేసి విచారణ జరపాల్సిన అవసరం ఏర్పడిందంటే వాస్తవాలు గమనించాలని ప్రజలను కోరుతున్నాను. ఇది దారుణమైన పరిస్థితి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిన సందర్భం. పోలీస్‌ యంత్రాంగం పూర్తిగా టీడీపీతో కుమ్మక్కైంది. టీడీపీతో కుమ్మక్కై ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం కోసం పావులుగా పోలీసులు పనిచేశారంటే కంచె చేను మేసినట్టు కాదా..? చేసిన తప్పుకు ఈసీతో చీవాట్లు తిని పోలీస్‌ యంత్రాంగం బాధ్యత వహిస్తోంది. పోలీసులను విచారణ చేయమని ఈసీ ఆదేశించిందంటే ఇది చిన్న విషయం కాదు. జిల్లాల్లో పూర్తి అవగాహన ఉన్న అధికారులను మార్చడం వల్లే హింస జరిగింది. ఎన్నికల సమయంలో జరిగిన దౌర్జన్యకాండకు సంబంధించి వైయస్‌ఆర్‌ సీపీ కేసు ఇస్తే.. ఇప్పుడు బ్యాలెన్స్‌ చేయడానికి కౌంటర్‌ కేసు తీసుకుంటున్నారు. అంతేకాకుండా 324 వేయాల్సిన చోట 307 సెక్షన్‌ మాపై వేస్తున్నారు. గందరగోళ పరిస్థితి నెలకొల్పుతున్నారు. ఇది వన్‌ సైడెడ్‌గా చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. టీడీపీ హింసకు పాల్పడితే తిరిగి మాపై తప్పుడు కేసులు పెట్టారు. చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, అనంతపురం ప్రాంతాల్లో దౌర్జన్యాలకు కారణమై పోలీసులు కొల్యూడ్‌ అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనిపై సిట్‌ చీఫ్‌ వినీత్‌కు వివరంగా వివరించాం. ఫాల్స్‌ కేసులు నివారించండి.. అవసరమైతే ఎస్‌ఐలు, సీఐల వద్ద కాల్‌ డేటాను సేకరించాలని, ఎవరెవరు ఏమేమి మాట్లాడారో తెలుస్తుందని కోరాం అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com