టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళగిరి నుంచి లోకేష్ మరోసారి బరిలోకి దిగుతుండగా.. భర్త కోసం బ్రాహ్మణి సైతం క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తు్న్నారు. అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని స్వర్ణకారులు, చేనేత కార్మికుల ఇళ్లను సందర్శించారు. వారి బాగోగులు విన్నారు. విజయ పచ్చళ్ల తయారీ కేంద్రాన్ని సందర్శించి వారితో ముచ్చటించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి వస్తే అండగా ఉంటామని నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు.