ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన భాదితులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 08:11 PM

వైయ‌స్ఆర్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా త‌న బిడ్డ‌కు జీవం పోశార‌ని తండ్రి శ్రీ‌ధ‌ర్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నుంచి ప్రారంభం అయిన ముఖ్యమంత్రి వైయస్.జగన్ 22వ రోజు బస్సుయాత్ర. అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి  వైయస్.జగన్ ను కలిసిన శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చమల్ల శ్రీధర్.ఆరోగ్య శ్రీ ద్వారా తన కుమారుడు త్రిషాన్ కు రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్న విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించి.. కృతజ్ఞతలు తెలియజేసిన శ్రీధర్.చిన్నారి త్రిషాన్ ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి.2022 జూలై 18న కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ జరిగిందని సీఎంకు చెప్పిన శ్రీధర్. కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత తన కుమారుడు త్రిషాన్ వినగలుగుతున్నాడని.. చిన్న చిన్న పదాలు కూడా పలుకుతున్నాడని ఆనందంగా ముఖ్యమంత్రికి చెప్పిన శ్రీధర్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com