కొర్రపాడుకు చెందిన అబ్దుల్ భాష, చిన్న కుళాయప్ప అనే ఇరువురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 18 మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి యశ్వంత్ తెలిపారు.మార్చి 22న ముద్దనూరు రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి రైల్వే స్టేషన్ వద్ద పార్కు చేసిన బైక్ చోరీకి గురి కాగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా గురువారం సీఐ వాహనాల తనిఖీల్లో నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు.