రష్యా రాజధాని మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 150 మంది చనిపోయారు. మరికొందరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
ఇప్పటికే 11 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఉక్రెయిన్తో సంబంధాలు కలిగి ఉన్నారని, అందుకే వారు ఆ దేశానికి పారిపోయేందుకు ప్రయత్నించారని రష్యన్ సెక్యూరిటీ సర్వీస్ పేర్కొంది.