ఏపీకి కూల్ న్యూస్ వచ్చింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద మాట్లాడుతూ.. ‘కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అలాగే మిగిలినచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండరాదన్నారు.