తూ. గో జిల్లా వ్యాప్తంగా 16, 08, 504 ఓటు హక్కు వినియోగించుకోనున్నారని జిల్లా కలెక్టర్ మాధవి లత సోమవారం తెలిపారు. వీరి కోసం 1, 577 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసామని అన్నారు. వీటిని 151 రూట్లుగా విభజించినట్లు వెల్లడించారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది, ఓటర్లకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని తరలించేందుకు వాహనాలు సిద్ధం చేశాం అని పేర్కొన్నారు.