బొమ్మనహాల్ మండలం గోవిందవాడలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. యువరైతు ఉపేంద్ర(25) విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. ఉపేంద్ర తన వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభం ఎక్కి కనెక్షన్ ఇస్తుండగా విద్యుత్ సరఫరా అయింది. దీంతో షాక్కు గురై కిందపడ్డాడు. అతడిని బళ్లారి ఆసుపత్రికి తరలించారు. ఉపేంద్రను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టామని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.