హిందూపురం వ్యవసాయమార్కెట్లో క్వింటా చింతపండు గరిష్టంగా రూ. 22 వేలు ధర పలికింది. మార్కెట్కు సోమవారం 25, 250 క్వింటాళ్ల సరుకు రాగా, ఈ-నామ్ పద్ధతిలో వేలం వేసినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ. 22 వేలు, కనిష్టంగా రూ. 10 వేల మేర పలికిందన్నారు. ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 8 వేలు, కనిష్టంగా రూ. 4, 200 ప్రకారం క్రయ విక్ర యాలు జరిగినట్లు ఆయన వెల్లడించారు.