శృంగవరపుకోట మండల కేంద్రమైన ఎస్.కోట ఆర్టీ సీ కాంప్లెక్స్ ఎదురుగా ఇద్దరు చిన్నారులను పిచ్చికుక్క గాయ పరిచింది. సోమవారం ఉదయం కాంప్లెక్స్కు ఎదురుగా ఉన్న ఇళ్ల నుంచి పాఠశాలలకు బయలుదేరుతున్న హృషికేష్, నేహ అనే చిన్నారులను కుక్క కరిచింది. దీంతో వారి తల్లిదండ్రులు ఎస్.కోట సీహెచ్సీకి తీసుకెళ్లి వ్యాక్సిన్ వేయించారు. ఇదిలా ఉండగా.. రోజూ వందల మంది రోగులకు వైద్యసేవలు అందిస్తున్న సీహెచ్సీలో నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడటం ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మాన వ హక్కుల న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ అన్నారు. సోమ వారం ఆయన మాట్లాడుతూ పిచ్చికుక్క కరచిన చిన్నారు లను ఆసుపత్రికి తీసుకెళ్లామని, వైద్యుల సూచన మేరకు గాయాలను కడగాలని కొళాయిల దగ్గరకు వెళితే నీరు రాలేదని తెలిపారు. పొరపాటున అగ్నిప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఈ విషయమై వైద్యాధికారి నీలను వివ రణ కోరగా మోటారు కాలిపోయిందని.. వెంటనే బాగు చేయించి నీటి సరఫరా పు నరుద్ధరించామని తెలిపారు.