రాజకీయంగా తగిన ప్రాధాన్యం, గుర్తింపు ఇవ్వాలని, కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ అధ్య క్షుడు పవన్కల్యాణ్కు వివరించిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు తాను కూటమితో పనిచేసే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటానని జనసేన మండపేట నియోజకవర్గ ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన జనసైనికులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. తొలుత ఆయన విలేకరులతో మాట్లాడారు. మండపేట నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తాను, జన సైనికులు ఎంతగానో శ్రమించామన్నారు. స్థానికసంస్థల ఎన్ని కలు, ఇతర అంశాలపై పవర్ షేరింగ్ వంటి అంశాలపె జన సైనికులు భరోసా కోరుతున్న నేపథ్యంలో మరోసారి జనసైని కులతో సమావేశమై నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. జనసేన నాయకులు నామాల చంద్రరావు, వల్లూరు సర్పంచ్ దాసి మీనాకూమారి, జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి దాల పర్తి శ్రీనివాస్, పార్టీ మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం మం డలాల అధ్యక్షులు కుంచే దుర్గాప్రసాద్, తుత్తుపు నాగ రాజు, వల్లూరి సత్యప్రసాద్, ఉండమట్ల రామారావు పాల్గొన్నారు.